వింటర్ ఒలింపిక్స్(2026), పారాలింపిక్స్కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్ ఒలింపిక్స్, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్ పారాలింపిక్స్ జరగనున్నాయి. ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఆటల అతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు. ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించింది.