ప్రస్తుతం అనేక సామజిక మాధ్యమాలు ఉన్నప్పటికీ, వీడియోలు చూసేందుకు ఉపయోగించేది మాత్రం యూట్యూబ్. ఇందులో సెకన్ల వ్యవధిలోనే కొన్ని వేల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో ఎన్ని వీడియోలు ఎంతమంది చూశారన్నది పెద్ద మిస్టరీనే, టాప్ ట్రెండింగ్లో రోజుకో వీడియో ప్రత్యక్షమవుతుంది. వీటిలో ఏయే వీడియోలు అత్యధికంగా వీక్షించారన్న దానిపై యూట్యూబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా.. టాప్ ట్రెండింగ్ వీడియోగా ఖందేశీ మూవీస్లోని ‘ఛోటు కే గోల్గప్పే’ నిలిచింది. టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోగా.. హీరో ధనుష్ మరియు సాయిపల్లవి కలిసి నటించిన తమిళ చిత్రం మారీ-2లోని ‘రౌడీ బేబీ’ సాంగ్ నిలిచింది. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా.. ఈ మూవీకి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. ఇక తరువాతి స్థానాల్లో ధావానీ భానుశాలి పాట వాస్తే జానే బి మరియు నిఖిల్ డి రెండవ స్థానాన్ని పొందాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మ్యూజిక్ వీడియోల విషయానికొస్తే.. ‘డాడీ యాంకీ’ మరియు ‘స్నోస్ కాన్ కాల్మా’ వీడియోలు టాప్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. భారత్లో మహిళా కంటెంట్ క్రియేటర్స్ ప్రాధాన్యత పెరిగిపోతుందని యూట్యూబ్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో వీరి సంఖ్య అధికమైందని తెలిపింది. 2016లో మిలియన్ సబ్స్క్రైబర్లు కల్గిన కంటెంట్ క్రియేటర్స్ ఒక్కరే ఉండగా.. ఈ మూడేళ్లలో వీరి సంఖ్య 120కి చేరిందని వెల్లడించింది.