telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 వరల్డ్ కప్ విజేతకు .. కాసుల పంట.. బహుమతి 28 కోట్లు…

2019 world cup winner will get huge prize

మరో మెగా సంబరం, క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు వేదికతో సహా సిద్ధం అయ్యింది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం.

ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్ తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు.

Related posts