telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. నేడు పాక్ తో ఆతిధ్య జట్టు.. టాస్ గెలిచి, ఫీల్డింగ్ లో …

2019 world cup pak vs england

2019 ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా పాక్ తో ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఆతిధ్య జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓటమిపాలైన పాక్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో పాక్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హరీస్ సోయల్, ఇమామ్ వాసిం స్థానంలో షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీలలను జట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేసింది. లైమ్ ప్లంకెట్ స్థానంలో మార్క్‌ వుడ్‌ని జట్టులోకి తీసుకుంది.

Related posts