కొలంబోకు చెందిన శ్రీలంక రెడ్క్రాస్ సొసైటీ శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 200 మందికి పైగా చిన్నారులు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని వెల్లడించింది. ఈ దాడుల్లో ప్రధాన ఆదాయ వనరులను కోల్పోయిన కుటుంబాలు తమ సాధారణ జీవితాలను కొనసాగించేందుకు అవసరమైన పొదుపు మొత్తాలను కూడా దాచుకోలేదని రెడ్క్రాస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది.
ఈస్టర్ పండుగ రోజు తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబో నగరంలోని మూడు చర్చ్లు, మూడు లగ్జరీ హోటళ్లపై దాడి చేసి దాదాపు 250 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.