telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తెలుగు సినిమాలపై.. సెట్ల భారం.. కోట్లలోనే ..

Chiranjeevi

చిరంజీవి తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాటిని ఎంటర్‌టైన్‌మెంట్ పై కొరటాల శివ స్నేహితుడు నిరంజన్‌రెడ్డి హీరో రామ్‌చరణ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటిగ్ ప్రారంభమైంది. రెజీనా, మెగాస్టార్‌పై ఓ ఐటమ్ సాంగ్‌ని షూట్ చేశారు. `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ ఫంక్షన్ సాక్షిగా కొరటాల శివ ఈ చిత్రాన్ని 99 రోజుల్లో పూర్తి చేయాలని కమిట్ చేయించాడు చిరు. దీంతో కొరటాల శివ, అతని డైరెక్షన్ టీమ్ ఉరుకులు పరుగుల మీద సినిమాని పూర్తి చేయాలని శ్రమిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఓ కాలనీ సెట్‌కు 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. కథకు కీలకమైన సెట్ కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడటం లేదట. దీనికి తోడు టెంపుల్ సెట్‌ని కూడా వేయబోతున్నారట.

వర్కింగ్ డేస్ తగ్గుతున్నా బడ్జెట్ మాత్రం హద్దులు దాటే అవకాశం వుందని తెలుస్తోంది. కాగా, త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ మెసెజ్ ఓరియెంటెడ్ మూవీకి `మెలోడీ బ్రహ్మ` మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

Related posts