telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

పోలీసుల తనిఖీల్లో రూ.2 కోట్లు స్వాధీనం!

hard cash

తెలంగాణ-మ‌హారాష్ట్ర రాష్ట్రాల స‌రిహ‌ద్దులో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ కారులో రూ.1.20 కోట్లు గుర్తించారు. మరో కారులో రూ.99.30 లక్షలు గుర్తించి..మొత్తం నగదును సీజ్‌ చేశారు.

రాత్రి వేళ కారులో వెళ్లారు. అయితే, తెలంగాణ నుంచి మ‌హారాష్ట్రలోకి ప్రవేశించి కొంత దూరం ప్రయాణించేసరికి ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువ పత్రాలు చూపకపోవడంతో..నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని..యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే విషయంపై నలుగురిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts