telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

హైదరాబాద్ లో … 2.4 కోట్లు పట్టుకున్న ఈసీ ..

huge money caught by police in ap

దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కారులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో సదరు వాహనంలో సోదాలు చేపట్టారు.

ఈ తనిఖీలలో కారులో దాచిన రూ.2.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related posts