వాళ్ళదేశంలో కరోనా భయంతో 15 మంది చైనీయులు రేణిగుంట విమానాశ్రయం ద్వారా భారత్ లోకి రావడం కలకలం రేపింది. బుధవారం బెంగుళూరు నుంచి ఇండిగో విమానంలో వారు రేణిగుంటకు చేరుకున్నారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దేశాలను కలవరపెడుతోన్న ఈ తరుణంలో 15 మంది చైనీయులు ఒక్కసారిగా రేణిగుంట ఎయిర్పోర్టులో కనిపించేసరికి అక్కడి వారందరూ భయాందోళనకు గురయ్యారు.
వీరంతా ముఖానికి మాస్కులు ధరించి ఉండడం చూసిన ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వీరు చైనా నుంచి రావడం లేదని.. బెంగళూరు నుంచి దేశీయ విమానంలో ఇక్కడకు చేరుకున్నట్లు అధికారులు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.