ఎన్నికల సందర్భంగా జరిగిన తనిఖీల్లో తమిళనాడులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం తనిఖీ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు చెప్పారు. అయితే ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో బంగారు నగలను, వ్యాన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఇంత భారీ ఎత్తున బంగారం పట్టుబడడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ సర్కార్పై రేవంత్ ఫైర్