ఈ స్కామ్ లో విచారణ వేగవంతం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఈ ఎస్ ఐ నిందితులు డైరెక్టర్ దేవికారాణి తో పాటు… మరో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించాం అని చెబుతున్న అధికారులు… మరింత క్షుణ్ణంగా విచారణ జరిపేందుకు ఈఎస్ఐ నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎస్ ఐ స్కాం లో మెడికల్ క్యాంపు నిర్వహించకుండా, నిర్వహిస్తున్నట్లు తప్పుడు మెడికల్ క్యాంపు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలను డ్రా చేసుకున్న సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈఎస్ఐ స్కామ్ లో వెలుగులోకి వచ్చిన సురేంద్రనాథ్ ఆడియోలు బయటకు రావడంతో ఆడియో టేపులు ఆధారంగా…. విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు తప్పుడు బిల్లు పెట్టాలని కొందరిని సురేంద్రనాథ్ బెదిరించినట్లు గుర్తించారు.
వాస్తవానికి ఆర్సీ పురం డిస్పెన్సరీ లో విధులు నిర్వహించాల్సిన సురేంద్రనాథ్ ని … డైరెక్టర్ దేవికారాని కార్యాలయానికి తెప్పించుకుని తన కోసం ఇక్కడ పని చేయించారట. ఒకేసారి ఇరవై మూడు చోట్ల సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు… దాదాపు పది వేల కోట్ల స్కామ్ జరిగినట్లు అంచనా వేశారు. ఈ పది వేల కోట్ల మందులకు గాను డైరెక్టర్ దేవికారాణి భారీగానే ముడుపులు ఆశించినట్టు తెలిసింది. అంతేకాకుండా అర్హతలేని ఏజెన్సీల నుండి కూడా మందులకు కొన్నట్లు స్పష్టమైంది.
కేసీఆర్ను గద్దె దింపే బాధ్యత తీసుకున్నాం: రాజగోపాల్రెడ్డి