telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

యూపీలో 12 ఏళ్ల బాలికపై…?

minor raped child in visakha

మన దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి.. ఇక, ఉత్తరప్రదేశ్‌లో వరుస ఘటనలు కలకలం రేపుతుండగా.. తాజాగా మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పశువుల మేత కోసం వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దుండగలు.. ఆ తర్వాత ఆ బాలిక ప్రాణాలు తీశారు. ఈ ఘటన మహారాజ్‌గంజ్‌ జిల్లా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పురెందర్‌పూర్‌లో ఈనెల 18వ తేదీన బాధితురాలి తల్లి పశువుల మేతకోసం పొలానికి వెళ్లింది.. అయితే, గడ్డిని ఇంటికి తీసుకెళ్లడానికి సైకిల్‌ తేవాలని తన 12 ఏళ్ల కూతురికి చెప్పింది.. తల్లి వెళ్లిపోయిన కాసేపటికి ఇంటి నుంచి సైకిల్‌పై బయల్దేరిన బాలిక.. ఎంతకి తన దగ్గరకు రాకపోవడంతో.. కూతురు కోసం వెతకడం ప్రారంభించారు.. అదేరోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బాలిక వాడిన సైకిల్‌తో పాటు చెప్పులు కనిపించాయి.. కానీ, బాలిక జాడ దొరకలేదు.. ఇక, మరుసటి రోజు సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు.. దీంతో ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

Related posts