telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ లో .. భారీ పెట్టుబడుల దిశగా .. మోడీ సౌదీ పర్యటన..

12 agreements between saudi and india

ప్రధాని నరేంద్రమోదీ సౌదీఅరేబియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు సల్మాన్ బిన్‌ అబ్దులజీజ్‌తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో దాదాపు 12 అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల పరస్పర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలికి మోదీ, యువరాజు సల్మాన్‌ అధ్యక్షులుగా ఉంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమావేశమై చర్చలు జరుపుతారు. ఉగ్రవాదంపై పోరు ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించారు.

ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రకటించారు. జాతి, మతం, సంస్కృతితో సంబంధం లేకుండా తీవ్రవాదంపై పోరుకు సహకరిస్తామని..పాకిస్థాన్‌కు సహజ భాగస్వామి అయిన సౌదీఅరేబియా భారత్‌కు హామీ ఇచ్చింది. సౌదీ అరేబియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. సౌదీ రాజు, యువరాజుతో భేటీ, భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులో కీలక ప్రసంగం తర్వాత దిల్లీకి వచ్చారు మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తోనూ భేటీ అయ్యారు. భారత్- సౌదీఅరేబియా మధ్య పరస్పర సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

మోదీ రియాద్ లో జరిగిన భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులోనూ ప్రసంగించారు. భారత్లోని అంకురసంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చే ఐదేళ్లలో చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. సౌదీలోనూ రూపే కార్డులు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. దీనిద్వారా అక్కడున్న 26 లక్షల మందితోపాటు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఉపకరిస్తుందని తెలిపారు.

Related posts