telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్ సైన్యం పై రాకెట్ల వర్షం కురిపించిన భారత ఆర్మీ…

పాకిస్తాన్ నిన్న మధ్యాహ్నం మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది.  తుపాకీ తూటాలతో పాటుగా మోర్టాన్ లతో కాల్పులకు తెగబడింది. సైనికులతో స్థావరాలతో పాటుగా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది.  పాక్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.  ఆరుగురు పౌరులు మరణించారు.  కొన్ని ఇల్లు ధ్వంసం అయ్యాయి.  గురేజ్ నుంచి ఉరి సెక్టార్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది.  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇండియాలోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం చేసింది.  అయితే, పాక్ కు బుద్ధిచెప్పేందుకు ఇండియా సైన్యం ఎదురుదాడికి దిగింది.  రాకెట్ల వర్షం కురిపించింది.  ఇండియా ఎదురుదాడిలో పాక్ లోని అనేక సైనిక బంకర్లు, లాంచింగ్ ప్యాడ్లు, చమురు నిల్వలు ధ్వంసం అయ్యాయి.  11 మంది పాక్ సైనికులు హతం అయ్యారు.  అనేక మంది పాక్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు.  దీనికి సంబంధించిన వీడియోను నిన్నటి రోజున ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.  గతేడాది ఆగస్ట్ నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉన్న విషయం తెలిసిందే.  

Related posts