telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రచార రధం కింద పడి .. 2 పదోతరగతి విద్యార్థులు మృతి.. 6 గాయాలు..

Road accident 8 dead and 30 injured

ఎన్నికల సందర్భంగా ప్రచారంలో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఓ పార్టీకి చెందిన కారులో విద్యార్థులు వెళుతుండగా, వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈరోజు పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లాలోని పెదమండ్యం మండలానికి చెందిన విద్యార్థులు బయలుదేరారు. వీరిని ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచారరథం ఎక్కించుకుంది. మార్గమధ్యంలో కలిచెర్ల వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీనివాస్, రామ్మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts