హైదరాబాద్ ఉప్పుగూడ కృష్ణానగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే నరేశ్ అనే బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన నరేశ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే టెన్త్ ఫెయిలవుతాననే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని నరేశ్ తల్లిదండ్రులు ఖండించారు. ఇంకా పరీక్షా ఫలితాలకు సమయముందని అలాంటిదేమీ లేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం: తలసాని