telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్‌..

jc-diwakar-reddy

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌ ఇచ్చారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా విధించారు. త్రిశూల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ. 100 కోట్ల జరిమానా విధించారని నిర్ణయించారు. రూ. 100 కోట్ల జరిమానా కట్టకపోతే.. ఆర్‌అండ్‌ ఆర్‌ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు అధికారులు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్‌ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. విలువైన లైమ్‌ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పని మనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్‌ సిమెంట్స్‌ అనుమతులు పొందారు. అంతే కాకుండా అనుమతులు వచ్చాక పని మనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు అధికారులు. కాగా.. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్‌ నిబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే..

Related posts