telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌..10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ లోకి జంప్

against bjp trying to apply last weapon as mp resigns

మూలిగే నక్క పై తాటికాయపడ్డట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారవుతుంది. ఇప్పటికే కర్ణాటక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. గోవా శాసనసభలో కాంగ్రెస్‌కు ఉన్న 15 మంది శాసనసభ్యులలో పదిమంది ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు కాషాయకండువా కప్పుకున్నారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 శాసనసభ స్థానాలుండగా, బీజేపీ-17, కాంగ్రెస్‌-15, గోవా ఫార్వార్డ్‌ పార్టీ-3, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ-1, ఎన్సీపీ-2, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో పదిమంది పార్టీని వీడుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది.

Related posts