రూ. 10 వేల కన్నా తక్కువ అగ్రిగోల్డ్ బాధితులకు నేను నగదు పంపిణి జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.
స్వయంగా జగన్ ల్యాప్ టాప్ లో బటన్ నొక్కగానే, వేలాది మంది ఖాతాల్లో వారి నగదు జమ అయింది. పలువురు తమ సెల్ ఫోన్లను చూపిస్తూ, తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నరసన్నపేట మండలం, కిల్లం గ్రామానికి చెందిన బాధితుడు పొట్నూరు శ్రీనివాసరావు, తన అకౌంట్ లో రూ. 10 వేలు జమ అయ్యాయని చెబుతూ, సెల్ ఫోన్ చూపుతున్న ఫోటో వైరల్ అవుతోంది.