హైదరాబాద్ పోలీసులు కారులో తరలిస్తున్న కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు కనిపించింది.
ఆ డబ్బుకు సంబంధించి వివరాలను ఆ డబ్బు తరలిస్తున్న వ్యక్తిని కోరగా, అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీనితో సదరు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మలక్పేటలో నిర్వహించిన తనిఖీల్లో ఎల్బీనగర్కు చెందిన కాంట్రాక్టర్ కాశీనాథ్ రెడ్డి కారు నుంచి రూ.34.30 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల