telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సికింద్రాబాద్ అభివృద్ధే తన లక్ష్యం: కిషన్ రెడ్డి

kishan reddy minister

సికింద్రాబాద్ అభివృద్ధే తన లక్ష్యం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటంలో జీహెచ్ఎంసీదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ శాఖలు చాలా బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. దాన కిషోర్ ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని అన్నారు. నగరాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని అన్నారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకుందామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను త్వరలోనే పరిశీలిస్తానని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నివేదికను అందజేస్తానని తెలిపారు. మౌళిక వసతుల కల్పనకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి కూడా తెలుగింటి కోడలేనని పేర్కొన్నారు.

Related posts