telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండవసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి

MMK

గత కొద్ది రోజుల క్రితం రాజమౌళి, కీరవాణి కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. తన కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా ఇచ్చారు. ఈ సందర్భంగా కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. “మా రక్తంలో ప్రతిరోధకాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నట్లు గుర్తించడంతో, నేను మరియు నా కొడుకు రెండవసారి ప్లాస్మాను దానం చేసాము. ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానం ఇవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని కీరవాణి వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వీళ్లిద్దరూ గతంలోనూ ప్లాస్మా ఇచ్చి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వీళ్లిద్దరూ ‌కిమ్స్ హాస్పిట‌ల్‌లో మొదటిసారి ప్లాస్మాను డొనేట్ చేశారు. అటు రాజమౌళి కూడా త్వరలో ప్లాస్మా డొనేట్ చేయనున్నారు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నానని, త్వరలో RRR మ్యూజిక్ ప్రారంభిస్తానని ఈ సందర్భంగా కీరవాణి వెల్లడించారు.

Related posts