రాంపూర్ లోక్ సభ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ప్రత్యర్థి ఆజంఖాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న నటి జయప్రద, ఆజంఖాన్లు ఇటీవల ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. జయప్రదపై ఇటీవల ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎన్నికల నేపథ్యంలో నేతలిద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా, ఆజంఖాన్పై జయప్రద మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు.
గత 20 ఏళ్లుగా ఆయన కేవలం రిగ్గింగుతోనే విజయం సాధిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ నకిలీ ఓటర్లు ఉన్నారని, వాటితోనే ఆయన గెలుస్తూ వస్తున్నారని జయప్రద ఆరోపించారు. రాంపూర్లో ముస్లింలను ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆజంఖాన్ ఇటీవల ఆరోపించారు. ఇక్కడ ముస్లింల ఇళ్లను దోచుకుంటున్నారని, అందరూ కలిసి వారిని కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఓటేసేందుకు బయటకు రావద్దని పోలీసులు ఆదేశించారని ఆజంఖాన్ పేర్కొన్నారు.
Jayaprada comments aajamkhan
జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: అయ్యన్నపాత్రుడు