telugu navyamedia
ఆరోగ్యం

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌.. బీఏ.2 కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌రం!!

ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బ‌య‌ట‌ప‌డింది.
దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విష‌యం తెలిసిందే.
కొవిడ్‌-19 మ‌ళ్లీ విజృంభిస్తోంది. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా కొత్త స‌బ్‌ వేరియంట్‌ను గుర్తించారు.
ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మేము క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్ల‌ను ప‌రీక్షించాం. అందులో ఒక‌టి బీఏ.12 స‌బ్ వేరియంట్‌గా గుర్తించాం.

12 శాంపిళ్లు బీఏ.2 స‌బ్ వేరియంట్‌’ అని మైక్రోబ‌యాల‌జీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి వెల్ల‌డించారు. ఇది బీఏ.2కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిపారు.

బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తించారు. ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఢిల్లీలో ఈ స‌బ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.

Related posts