telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

భయంతోనే చంద్రబాబు కేంద్రానికి లేఖ: బొత్స

YS Jagan Files Nomination Pulivendul
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆ పార్టీ  పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారయణ అన్నారు.  శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. భయంతోనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. 
ఎన్‌ఐఏ విచారణ చేయాలని కోర్టే తీర్పు ఇచ్చిందని, ఏపీ పోలీసుల నివేదికలో కూడా వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా ఉందన్నారు. ఈ హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని దుయ్యబట్టారు.నిందితుడు  శ్రీనివాసరావుని వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Related posts