telugu navyamedia
సినిమా వార్తలు

నెటిజన్లకు రష్మీ విజ్ఞప్తి

Rashmi

“జబర్దస్త్” బుల్లితెర కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ నెటిజన్లతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా రష్మీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. ”ప్రతి ఒక్కరికీ నా తరఫున ఒక విన్నపం. కుక్కలపై, ఇతర జంతువులపై రంగులు పూయకండి. పొరపాటున రంగులు వాటి కళ్లలో పడితే అవి చూపు కోల్పోతాయి. ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్లి మీ శరీరానికి అంటిన రంగులను శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ అవి అలా చేయలేవు” అంటూ ట్వీట్ చేసింది. ఇటీవల ఇటీవల ఓ వీధి కుక్క గాయపడితే దాన్ని చూసిన రష్మి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి తనవంతు సహాయం అందించింది. తాజాగా మరోసారి మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకుంది. ఈరోజు హోలీ సందర్భంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటారన్న విషయం తెలిసిందే. 

Related posts