యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం “అర్జున్ సురవరం”. ఈ మధ్యే విడుదలైన టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ లో “అబద్దాన్ని నిజం చేయడం చాలా సులభం..కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం చాలా కష్టం…” అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ సాధించింది. మీరు కూడా ఈ టీజర్ ను చూసేయండి.
స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఈ చిత్రంలో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మధు అర్జున్ సురవరం చిత్రాన్ని సమర్పిస్తున్నారు.