గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గురించి ప్రముఖ కెనడియన్ ఫిలింమేకర్ ఆలిసన్ రిచర్డ్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఫెస్టివల్కు ఆలిసన్ను గెస్ట్గా పిలిచారు. దాంతో ఎంతో ఎగ్జైటింగ్గా ఇండియాకు వచ్చారు. కానీ ఈ వేడుకలో అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. “నా హోటల్ నుంచి 1.3 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాను. కానీ సైకిల్కు పార్కింగ్ లేదు. పైగా బ్యాగ్లో ఏవన్నా వస్తువులు ఉంటే లోపలికి రానివ్వరు. బ్యాగ్స్ లోపల ఉన్న గదిలో పెట్టి వెళ్లాలి. నాకు పార్కింగ్ లేనప్పుడు నేను లోపలికి ఎలా వెళ్లగలను? నా బ్యాగ్ చేతిలో పెట్టుకుని నేను ఎక్కడికి పోవాలి? నన్ను గెస్ట్గా పిలిచారు. తీరా వచ్చాక క్రిమినల్గా చూశారు. నేను సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉన్నాను. 25 ఏళ్లుగా ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్కు హాజరవుతూ ఉన్నాను. కానీ ఇంతటి వరస్ట్ ఫెస్టివల్ను ఇండియాలో కాకుండా ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. సాయం చేస్తారేమోనని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వారికి నా భాష అర్థంకాక ఫోన్లు పెట్టేసేవారు. మాకు మర్యాద ఇవ్వనప్పుడు మాలాంటి వారిని ఇండియాకు పిలవకండి. దీనిని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని పిలవకండి. గోవాలో కేవలం పబ్లిక్ కోసం నిర్వహించిన ఈవెంట్లా కనిపిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐఫీ నిర్వాహకుల వల్ల ఇబ్బందిపడ్డారు. ఈవెంట్ అయిపోయాక ఆయన వెళ్లడానికి కారు ఏర్పాటు చేశారు. కానీ కారులో ఉండాల్సిన డ్రైవర్ కనిపించకుండాపోయాడు. దాంతో అమితాబ్ డ్రైవర్ వచ్చేవరకు కారు వద్దే ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో షో నీయీవాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు.
previous post