telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించిన పోస్కో

tirumala guest house

ప్రఖ్యాత గాంచిన శ్రీవారి తిరుమల దేవస్థానం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే మన దేశంలోనే కాకుండా.. ఇతర దేశంలోనూ శ్రీవారికి భక్తులున్నారు. ఆ ఏడుకొండల స్వామి వారిని దర్శించుకోవడానికి ఎన్ని సముద్రాలైన దాటేస్తారు. అలాంటి మహిమ కలిగిన స్వామి తిరుమల శ్రీవారు.ఎక్కడేక్కడి నుంచో వచ్చి శ్రీవారి మొక్కలు తీర్చుకుంటారు. కరోనా కాస్త తగ్గడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే.. తాజాగా పోస్కో సంస్థ శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది. శ్రీవారికి ఎస్వీబీసీ ట్రస్టుకు ఏకంగా రూ. 9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Related posts