telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే గత రెండు మ్యాచ్ లలో కూడా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఈ మ్యాచ్ లో కూడా అదే చేయబోతుంది. ఎందుకంటే… ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో కేవలం ఒక్కే ఒక మార్పుతో భారత్ బరిలోకి దిగుతుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ నటరాజన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లాడ్ జట్టులో కూడా టామ్ కర్రన్ స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకు 1-1 తో సిరీస్ లో సమానంగా ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇండియా జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (c), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (w), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, నటరాజన్

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ (w/c), లియాన్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

Related posts