telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నీటి కుంటలో పడి భార్యాభర్తల మృతి…

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని కురవపల్లి లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఇట్నేనివారిపల్లె సమీపంలో నీటి కుంటలో పడి భార్యాభర్తల ఇద్దరు మృతి చెందారు. భర్త నారాయణ (68) భార్యా వెంకట రమణమ్మ (62) దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె మండలంలోని సిటిఎం లో స్థిర పడ్డారు. లాక్ డౌన్ కారణంగా వారి సొంత గ్రామమైన కురవపల్లె కు వచ్చి జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఇట్నేని వారి పల్లె సమీపంలోని వారి పొలంలో వేరుశనగ పంటకు కాపలా ఉన్నారు దంపతులు. ఐహే అక్కడే సమీపంలో ఉన్న గుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి కాలు జారీ నీటి గుంటలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ఊరిలో విషాదం చోటుచేసుకుంది. ఇక విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం వారి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటన పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts