వరుణ్ తేజ్, అథర్వ మురళి ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. ప్రస్తుతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న గద్దలకొండ గణేష్ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అథర్వకి జంటగా మృణాలినీ రవి నటించింది. కెరీర్లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలకు ప్రశంసలు దక్కాయి. నిజానికి మిక్కీ కంటే ముందు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దేవి తప్పుకున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్తో విభేదాల వల్లే దేవి తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో హరీష్ క్లారిటీ ఇచ్చాడు. “నేను ‘గద్దలకొండ గణేష్”లో వెల్లువొచ్చే గోదారమ్మ పాట రీమిక్స్ చేయాలనుకున్నాను. కానీ, దేవీగారు ఎప్పుడూ రీమిక్స్ చేయకూడదని నియమం పెట్టుకున్నారు. నేను దేవీని ఒప్పించగలనని అనుకున్నాను. అయితే ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. మేం మళ్లీ కలిసి పనిచేస్తాము” అని హరీష్ చెప్పాడు. ఆ వీడియో గురించి తాజాగా దేవిశ్రీప్రసాద్ ట్విటర్ ద్వారా స్పందించాడు. “చక్కని వివరణకు ధన్యవాదలు డియరెస్ట్ సర్ జీ హరీష్ శంకర్. మీ నిజాయితీకి హ్యాట్సాఫ్. మీపట్ల నాకున్న ప్రేమ, గౌరవం మరింత పెరిగాయి. మీతో కలిసి పని చేసేందుకు నేను కూడా ఎదురు చూస్తున్నాను” అని దేవి ట్వీట్ చేశాడు.
Thaaank U Dearest Sirrr jiii @harish2you 4 d lovely words n a beatiful clearification..🙏🏻
Hats off to ur Honesty 🙏🏻
My Lov n Respect for you have increaed ! 🙏🏻❤️🎹🎵
& ofcourse am also waiting n wud lov to work with U veryyy soooon 😁🎹🎶❤️ pic.twitter.com/RwV0sgUpmh
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 14 October 2019