ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రెండేళ్ల పాటు ఆయన కొనసాగనున్నారు. అధికార భాషా సంఘంతో పాటు నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఎంఎస్ నెం.10 ను విడుదల చేశారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను గతంలో అందుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కేంద్రీయ హిందీ సంస్థలో యార్లగడ్డ సభ్యుడిగా ఉన్నారు.