telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?

Anushka-Sharma

విరుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జంట విరాట్ కోహ్లీ, అనుష్కలలది. ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు అనుష్క. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో నిర్మించిన ‘పాతాళ్ లోక్’ సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్ కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్ లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. నటనకు ముగింపు పలకాలనే యోచనలో అనుష్క ఉందనేదే ఆ వార్త. అందుకే తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తోందనేది బీటౌన్ టాక్. 2018లో విడుదలైన ‘జీరో’ అనుష్క చివరి చిత్రం.

Related posts